ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యా భర్తలు, నలుగురు పిల్లలతో సహా సంఘమిత్ర రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీశారు. మృతులు కడప జిల్లా బద్వేలులో చిరు వ్యాపారం చేసుకుంటున్న సునీల్, రమ దంపతులుగా గుర్తించారు. నెల్లూరుకు చెందిన సునీల్, ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన రమలు దంపతులు కాగా వీరి సంతానం ఐదేళ్ళ ఉష, కవల పిల్లలు కళ్యాణ్, కళ్యాణి, మూడు నెలల వయస్సున్న ఓ బాలుడిగా గుర్తించారు. భర్త సునీల్కు భార్య రమపై అనుమానం కలగడంతో ఆమెను పుట్టింటికి పంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య బంధువులతో మాట్లాడి ఆమెను కందుకూరులో విడిచి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ తన భార్య, నలుగురు పిల్లలతో సహా ఉలవపాడు రైల్వే స్టేషన్కు వచ్చి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన కారణంగా స్టేషన్లో రైలును 20 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్యేనని స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఈ సంఘటనపై ఉలవపాడు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.