YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముగిసిన రాష్ట్రపతి పర్యటన వీడ్కోలు పలికిన గవర్నర్

ముగిసిన రాష్ట్రపతి పర్యటన వీడ్కోలు పలికిన గవర్నర్

హైదరాబాద్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం అయన ఢిల్లీకి బయలుదేరారు ఆదివారం  మధ్యాహ్నం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి... ముచ్చింతల్లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 120 కేజీల బంగారంతో రూపొందించిన రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ప్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్న  రాష్ట్రపతికి గవర్నర్ తమలిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు విడ్కోలు పలికారు. బేగం పేట ఎయిర్ పోర్టుకు గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.

Related Posts