YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టిడ్కో ఎండీతో టీడీపీ నేతల భేటీ

టిడ్కో ఎండీతో టీడీపీ నేతల భేటీ

విజయవాడ
విజయవాడలో టిడ్కొ ఎండి శ్రీధర్ తో  టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, బోండా ఉమ, నాగులు మీరా సోమవారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లడారు. ఒక రూపాయి కట్టకుండా జగన్ ఇల్లు కట్టిస్తా అని ఇచ్చిన హామీ ఏమైందని బోండా ఉమ ప్రశ్నించారు. మూడేళ్ళ కాలంలో జగన్ సర్కార్ ఒక ఇల్లు కట్టలేదన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇల్లు పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. టిడ్కొ కార్యాలయం చుట్టూ టీడీపీ నేతలు, పేదలు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇళ్ల కోసం పేదలు కట్టిన డబ్బులు కొట్టేశారని ఆరోపించారు. నెలలోపు టిడ్కో ఇల్లు ఇవ్వకపోతే... టిడ్కో కార్యాలయంలో పేదలను కూర్చోబెడతామని దేవినేని ఉమ హెచ్చరించారు.  టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహాన్ మాట్లాడుతూ... కట్టిన పేదల డబ్బులు అయినా ఇవ్వండి....లేదా ఇల్లు అయినా ఇవ్వండి అని ఎండిని కోరినట్లు తెలిపారు. మూడేళ్ళ నుండి టిడ్కో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి పేదలపై జాలి అనేది లేదని విమర్శించారు.  టీడీపీ అధికార ప్రతినిధి నాగులు మీరా మాట్లాడుతూ... విజయవాడలో రూ.16 కోట్ల ఇళ్ల కోసం పేదలు డబ్బులు కట్టారని తెలిపారు. వడ్డీతో సహా పేదలకు డబ్బులు తిరిగి ఇవ్వాలని...లేదా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక వడ్డీకి తెచ్చి పేదలు ఇళ్ల కోసం డబ్బులు కట్టారని అన్నారు.

Related Posts