YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 20 న పవన్ కళ్యాణ్ నర్సాపురం రాక

ఈ నెల 20 న పవన్ కళ్యాణ్ నర్సాపురం రాక

నర్సాపురం
 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో  ఈనెల 20న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నత సభ  నిర్వహిస్తున్నట్లు జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ అన్నారు.మత్స్యకారులపై వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మంత్రి అప్పలరాజు చెప్పేవన్ని అబద్ధాలే అన్నారు.మంత్రి స్వంత జిల్లా లో మత్స్యకారుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న మత్స్యకారులకు కూడా బీమా ఇవ్వలేని దుస్థితి జగన్  ప్రభుత్వానిదన్నారు. ఈనెల 18న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నరసాపురం వస్తారన్నారు. ఆయనతో కలిసి నరసాపురం పట్నం, మొగల్తూరు, నర్సాపురం మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించి  వారి సమస్యలను తెలుసు కుంటామన్నారు. నరసాపురం టౌన్ 25 వార్డులో పవన్ కళ్యాణ్ నిర్వహించే సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సభను మత్స్యకారుల తో పాటు జనసేన శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు.

Related Posts