YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ అరెస్ట్

రేవంత్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 17
టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడడానికి ఉందా… ప్రతి పక్ష నేతల అరెస్ట్ లకోసమే పనిచేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. మహిళా నాయకురాళ్లను రాత్రి వరకు పోలీసు స్టేషన్ లలో ఉంచారని ఆయన విమర్శించారు. తెలంగాణా లో ఉన్నామా…నార్త్ కొరియా లో ఉన్నామా అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో ఫాసిస్టు పాలన సాగుతుందని, ప్రజలు మీ పాలన ను చీదరించు కుంటున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అరాచక పాలన నడవదని, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం చక్రవర్తిగా.. ఎమ్మేల్యే లు సామంతులుగా పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా
అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ఆయన మండిపడ్డారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి… కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని, నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం… నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందని, కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయండని ఆయన అన్నారు.

Related Posts