YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ లో సీఎం పోటీదారులు ఎక్కువ : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ లో సీఎం పోటీదారులు ఎక్కువ : మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా మానురు మండల కేంద్రంలో రైతు బంధు చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ బీ.బీ.పాటిల్,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, రాములు నాయిక్, ఇతరులు పాల్గోన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ లో కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సు మంటుంది. కాంగ్రెస్ సభ లలో జనం లేక వెల వెల బోతున్నాయని అన్నారు. జనం సీఎం కెసిఆర్ బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎం ల్ ఏ లు తక్కువ. సీఎం పోటీ దారులు  ఎక్కువ అని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాడవం జరగదు...జానా రెడ్డి,ఉత్తమ్ రెడ్డి తాము గెలుస్తోరో లేదో చూసుకోవాలి. రైతు బంధు పథకం గాలిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. రైతులకు కొండంత అండ గా సీఎం కెసిఆర్ ఉన్నారు. రైతుల గుండెల్లో సీఎం కెసిఆర్ చిరస్మనియంగా మిగిలిపోతారు. ఒక్క నారాయణ ఖేడ్ నియోజకవర్గం లొనే 180 కోట్ల పెట్టుబడి సహాయం ఇస్తున్నమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ ప్రాజెక్టు కు అనుసంధానం చేస్తాం. సింగూర్ ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణ ఖేడ్, జహీరాబాద్  నియోజకవర్గలకు సాగు నీరు ఇస్తాం. త్వరలోనే సర్వే పనులు ప్రారంభిస్తామని అన్నారు. 

Related Posts