YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేదల సుస్తి పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు

పేదల సుస్తి పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు

సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా  రామచంద్రాపురం మండలం ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, ఎల్ఐజీ  భారతీ నగరి  కాలనీలో బస్తీదవాఖానాలు  మంత్రి హరీశ్ రావు శనివారం ప్రారంభించారు.   మంత్రి మాట్లాడుతూ బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. జీహెచెఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ దవాఖానాల్లో నిపుణుడైన ఎంబిబిఎస్   డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకప వైద్య సేనలు అందిస్తారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి. బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్  ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు. ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ బస్తీ దవాఖానాలు అన్ని రాష్ట్రాల్లో  పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించింది. టీ డయాగ్నసిస్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు  అందుతుంది. ఈ ఆసుపత్రిసేవలు వినియోగించుకోండని అన్నారు.
హైదరాబాద్ పరిథిలో 256 బస్తీదవాఖానాల ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేలమంది ఉచిత వైద్యం  అందుతోంది. పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు లేవు అన్న  సమస్యే ఉండదు. పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయి.  ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని టిమ్స్ లో ఇక అన్ని రకాల వైద్య సేవలు , కార్పోరేట్ ఆ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తాం. పేద ప్రజలకు ఉత్తమ సేవలు అందాలని సీఎం కేసీఆర్ గారు వైద్య రంగాన్ని బలోపేతతం చేస్తున్నారు. పేదలు ఖర్చు ఎక్కువ పెట్టేది వైద్యం, విద్య పైనే. అందుకేసీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా కార్పోరేట్ ఆసుపత్రుల సేవలు అందిస్తూనే , కార్పోరేట్ విద్యాసంస్థల్లో అందే విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు మన ఊరప -  మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
7280 కోట్లతో మన ఊరు -  మన బడి పేరుతో  వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12  రకాల సౌకర్యాలు కల్పించనున్నాం. డిజిటల్ క్లాస్ రూంలు, క్లాస్రూం కు రంగులు, మంచి బోర్డులు, బాతు రూం, మంచి నీరు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు. బొంబాయి కాలనీలోని పాఠశాలను తొలి విడతగా అభివృద్ధి చేస్తాం. పేద పిల్లలకు కార్పోరేట్ తరహా ఆంగ్ల  మాధ్యమంలో విద్య అందిస్తాం. బొంబాయి కాలనీలో త్వరలోనే ఫంక్షన్ హాలు నిర్మాణం పూర్తి చేస్తాం. ఎల్ఐజి   భారతీనగర్ వాసులు ఆర్టీసీ బస్ సర్వీసు నడపాలని కోరారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అన్నారు.

Related Posts