YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్
ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చికిత్స సమయంలో ఆయన పల్స్ దొరకడం కూడా కష్టతరమైందని వైద్య వర్గాలు వెల్లడించాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపొంది మంత్రి అయ్యారు. వారం రోజులు దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చారు.

Related Posts