YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ అమ్మాయిలు...మహా ముదుర్లు

హైద్రాబాద్ అమ్మాయిలు...మహా ముదుర్లు

అర్థరాత్రి పీకలదాకా తాగి, ఆపై డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కకుండా ఉండటానికి ఇద్దరు యువతులు పోలీసుల్నే బోల్తా కొట్టించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో తమ తెలివితేటలతో ఖాకీలకు మస్కా కొట్టి, డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకున్నారు. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రోడ్డు నెంబరు 45లో మద్యం సేవించి, ఖరీదైన కారు నడుపుతూ ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు. పోలీసుల తనిఖీలను దూరం నుంచి గమనించిన వాళ్లు వెంటనే కారు ఆపి కిందకు దిగారు. వీరిలో నల్ల రంగు టీషర్టు ధరించిన ఓ యువతి ఫుల్లుగా మద్యం సేవించగా, ఆమె స్నేహితురాలు తక్కువ మోతాదులో సేవించింది. ఓ కారు ఆగిందన్న విషయాన్ని గమనించిన పోలీసులు, నల్ల రంగు టీషర్ట్ ధరించిన అమ్మాయి వాహనం నడిపిందని చూశారు కూడా. పోలీసులు ఈ కారు దగ్గరకు చేరుకునేలోపే, ఆ ఇద్దరు యువతులు పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్లి, తమ దుస్తులను పరస్పరం మార్చుకున్నారు. అక్కడి నుంచే తన స్నేహితుడి రప్పించారు. అతడు రావడానికి నిమిషం ముందే వీరిద్దరూ ఏటీఎం నుంచి బయటకు వచ్చారు.

కారును రోడ్డుపై ఎందుకు ఆపారని పోలీసులు ప్రశ్నిస్తుండగానే, వీరి స్నేహితుడు వచ్చి కారు తనదని చెప్పాడు. అతడికి బ్రీత్ ఎనలైజింగ్ పరీక్ష నిర్వహించగా ఆల్క్‌హాల్ శాతం సున్నాగా చూపించింది. దీంతో చేసేదేమీ లేక రాంగ్ పార్కింగ్ కింద జరిమానా విధించిన పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. డ్రైవింగ్ సీటులో ఉన్నవారికి మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేయాల్సివుంటుందని, తాము వెళ్లేసరికి వాహనంలో ఎవరూ కనిపించలేదని అన్నారు. ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే, వారి నాటకం ఎలా రక్తి కట్టిందో తెలిసిపోతుందని అక్కడున్నవారు గుసగుసలాడుకోవడం విశేషం.

Related Posts