శంషాబాద్
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రైడెంట్ హాస్పిటల్ లో మృతదేహానికి వైద్యం చేసిన ఘటన ఇది. నాలుగు రోజుల కిందట షాద్ నగర్ కు చెందిన మధు క్రిమికీటకాలకు వాడే మందు తాగడం తో బంధువుల సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఉస్మానియాకు రిఫర్ చేసారు. అయినా, మధు బతుకుతాడనే ఆశ తో శంషాబాద్ లో ట్రైడెంట్ హాస్పిటల్ కి తీసుకు వచ్చారు. అయితే, ఆదే సమయంలో మధు చనిపోయాడు. అయినా, నాలుగు రోజుల నుండి చనిపోయిన శవానికి వైద్యం చేశారు. విషయం తెలిసిన బంధువుల రంటూ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు.