YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో పవన్ పర్యటన

తిరుమలలో పవన్ పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పవన్ జాపాలి ఆంజనేయుడ్ని దర్శించుకున్నారు. స్వామివారికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పవన్‌కు తీర్థప్రసాదాలు అందజేసి...స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. తర్వాత జనసేన అధినేత అక్కడే అడవిలో కాసేపు సరదాగా గడిపారు. పవన్ రాకను గమనించిన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు... కొంతమంది అయితే కాన్వాయ్‌ను వెంబడించారు. శనివారం నాడు పవన్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు చేరుకొని... ఆదివారం వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం కొద్దిసేపు పార్టీ నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇవాళ జాపాలి ఆలయానికి వెళ్లారు. జనసేనాని  మంగళవారం కూడా తిరుమలలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Related Posts