YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రూ.18 వేల కోట్లు వెనక్కి వచ్చేసాయి

రూ.18 వేల కోట్లు వెనక్కి వచ్చేసాయి

న్యూఢిల్లీ
దేశంలోని బ్యాంకులలో రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన  వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీల నుంచి ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లను రాబట్టినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద నమోదయిన అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్ల అని అయన వెల్లడించారు. న్యాయమూర్తులు ఎ.ఎం.ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం, చట్టం ప్రకారం ఆస్తుల సోదాలు, జప్తు, అటాచ్మెంట్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించింది. ఈ చట్టం ప్రకారం గత ఐదు కేసుల కంటే ఈ ఏడాది చాలా ఎక్కువ కేసులను ఈడీ దర్యాప్తు చేస్తోందని మెహతా కోర్టుకు విన్నవించారు. విజయ్ మాల్యా 17 భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీలు రూ.14,000 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి. మార్చి 2018లో, ప్రత్యేక కోర్టు వీరిద్దరిపై నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 18 వేల కోట్ల ఆస్థులను ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts