తెలంగాణ కాంగ్రెస్,బీజేపీ నేతలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం మనుర్లో రైతు బంధు కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. నాడు కాంగ్రెస్ నేతలు వ్యవసాయం దండగ అన్నారు.. నేడు టీఆర్ఎస్ వ్యవసాయం పండగ అంటోందన్నారు. నాడు ప్రజలు వలసలు వెళితే.. టీఆర్ఎస్ పాలనలో నేడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.