YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్రమంత్రికి సీఎం జగన్ ఫోన్ ఉక్రేయిన్ నుంచి తెలుగు వారిని తీసుకురావాలని అభ్యర్ధన

కేంద్రమంత్రికి సీఎం జగన్ ఫోన్ ఉక్రేయిన్ నుంచి తెలుగు వారిని తీసుకురావాలని అభ్యర్ధన

అమరావతి
రష్యా దాడులతో కుదేలవుతున్న ఉక్రెయిన్లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఇప్పటికే లేఖ రాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా ఆయనకు శుక్రవరారం నాడు  ఫోన్ చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జైశంకర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను ముందుగా పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా.. జైశంకర్కు ఫోన్ చేసే ముందు ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. సీఎం జగన్ కలెక్టర్ల స్థాయిలో కాల్సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలని, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సీఎం పేర్కొన్నారు.

Related Posts