YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ సంప్రాదాయలు వద్దంటూ చర్చ

కాంగ్రెస్ సంప్రాదాయలు వద్దంటూ చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 28,
కాషాయదండులో గత కొన్నాళ్లుగా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. రెబల్‌ నేతలు భారతీయ జనతా పార్టీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రహస్యంగా పదిహేను సార్లు భేటీ అయ్యారు. సంజయ్‌ సొంత జిల్లాకు చెందిన నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, అర్జున్‌రావులాంటి నేతలు ఏకంగా అసమ్మతిని హైదరాబాద్‌ వరకు రాజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(లో రెబల్‌ బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. అధిష్టానం నిత్య అసమ్మతివాదులపై వేటు వేయాలని తుది నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అదే టైంలో కీలక మలుపు చోటుచేసుకుంది.బీజేపీ తిరుగుబాటు నేతలు… రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌తో సంధి చర్చలకు దిగివచ్చారు. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎకరువు పెట్టారు. గతంలో బండి సంజయ్‌తో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేశారు. తమకు సంజయ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని… చిన్నచిన్న అభిప్రాయబేధాలను సమావేశంలో చర్చించుకున్నారు. అసమ్మతి నేతలు పొరపాటును గ్రహించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భావిస్తున్నారు. రెబల్‌ లీడర్స్‌ మాత్రం తమ పట్టు సాధించుకున్నామనే ధోరణిలో ఉన్నారు. సమావేశం తర్వాత ఎవరికి వారు పంతం నెగ్గిందని భావించినట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్‌ సాంప్రదాయం చర్చలు, బుజ్జగింపులు… కాషాయం దళం ఫాలో కావడం పట్ల పలువురు నేతలు అభ్యంతరం చెబుతున్నారు. అలిగిన ప్రతీసారి చర్చలు, బుజ్జగింపులతో సరిపెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కాషాయదండులో కొత్త కల్చర్‌ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తుంది.

పార్టీని నిలబెట్టుకొనేదెలా...
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామన్నది వారి వాదన. ఈ విషయంలో పైకి ఎన్ని చెప్పినా కమలనాథుల్లో అంతర్గతంగా మరో చర్చ జరుగుతోంది. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా లేమని ఆందోళన చెందుతున్నారట. గ్రౌండ్‌ లెవల్లో బలోపేతం కాకుండా.. నియోజకవర్గాలకు ఒక ముఖాన్ని పరిచయం చేయకుండా ఎన్ని చేసినా నేల విడిచి సాము చేయడమేనన్నది వారి అభిప్రాయం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టి ఇంఛార్జ్‌ను ప్రకటించాలని.. అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాలని కేడర్‌ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని మెజారిటీ సెగ్మెంట్లకు బీజేపీ నుంచి ఫలానా నాయకుడు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. బీజేపీలో ముందుగా అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం లేకపోయినా అనధికారికంగానైనా చెబితే మంచిందనే చర్చ జరుగుతోంది. కానీ.. ఆ మేరకు సంకేతాలు పంపేందుకు కమలనాథులు జంకుతున్నారు. ఈ వైఖరే బీజేపీలోకి వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు.. వారి అనుచరులకు మింగుడు పడటం లేదు.కమలం గుర్తుపై పోటీ చేసే ఆలోచనతో బీజేపీలో చేరిన నాయకులు అనేకమంది. అలాంటి వారిలో చాలా మంది తమ రాజకీయ భవిష్యత్‌పై అభద్రతాతో ఉన్నారట. టికెట్‌పై క్లారిటీ లేకపోవడం.. నమ్మకం ఇచ్చే పెద్దలు లేక టెన్షన్‌ పడుతున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాలకు కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల తమకు తెలియకుండానే తమకన్నా తక్కువస్థాయి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. వారికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని గుర్రుగా ఉన్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థులమని ప్రచారం చేసేసుకుంటున్నారు. టికెట్‌ ఆశించి బీజేపీలోకి వచ్చిన పెద్దలకు అది రుచించడం లేదట.కాషాయ కండువా కప్పుకొన్న సమయంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం వలస నేతల్లో కనిపించడం లేదు. సన్నిహితులు కలిసినప్పుడు.. ఆంతరంగిక సమావేశాల్లోనూ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఇప్పుడే తమ దారి చూసుకోవడం బెటర్‌ అనే అభిప్రాయంలో ఉన్నట్టు కాషాయ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కొత్తగా బీజేపీకి వచ్చే వారికి బ్రేక్‌లు వేస్తున్నాయట. ఈ మధ్య బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి అదే కారణమన్నది కొందరి అభిప్రాయం.అభ్యర్థి ఎవరో చెప్పేస్తే.. నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామని.. స్థానికంగా చేరికలు ఊపందుకుంటాయని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారట. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే టికెట్లు ఇచ్చే సమయంలో చూసుకోవచ్చునని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో పార్టీ నుంచి వచ్చి..ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ సభ్యుడి ఉన్న నాయకుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ ఫోకస్‌ పెట్టి.. అక్కడ బలంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురావడం.. ఉన్న వారికి భరోసా ఇవ్వడం ఈ సమయంలో చాలా ముఖ్యమన్నది ఆయన వాదన. మరి.. బీజేపీ పెద్దలు ఈ విషయం గమనించారో లేదో చూడాలి.

Related Posts