YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతికి పాకిన డ్రగ్స్ ,హుక్కా సంస్కృతి

తిరుపతికి  పాకిన డ్రగ్స్ ,హుక్కా సంస్కృతి

ఇప్పటివరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమయిన డ్రగ్స్ ,హుక్కా సంస్కృతి ఇప్పుడు మధ్య తరగతి నగరాలకు విస్తరించిందా ఇదే నిజమేనని అనిపిస్తోంది. తిరుపతిలో జరిగిన సంఘటనలను గమనిస్తే తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాలలో లోని విశ్వతేజా హాస్టల్ లో పోలీసుల దాడిలో హుక్కా పాత్రతో పాటు రూమ్ నిషేదిత వస్తువులు లభ్యం కావడంతో డ్రగ్స్ మాపియాకు తిరుపతి అడ్డాగా మారనుందా అన్న రీతిలో అర్థం కాని ప్రశ్నలు బయటపడుతున్నాయి.ఓకే చోట తొమ్మిది యూనివర్సిటీలు,వందల సంఖ్యలో మిగతా విద్యాసంస్థలు,ఏకంగా పాతిక వేల మందికి పైగా  విద్యార్థులు వున్న తిరుపతి పై డ్రగ్స్ మాఫియా కన్నెసిందా..విద్యార్థులతోపాటు యాత్రీకులను దృష్టిలో వుంచుకోని తమ అమ్మకాలు పెంచుకోవడానకి ప్రయత్నాలు సాగిస్తుందా అంటే అది నిజమేనని అనిపిస్తుంది.అన్ని ప్రాంతాల నుంచి రొడ్డు,రైల్వేతో పాటు విమాన సౌకర్యం వుండటం కూడా అక్రమ రవాణా దారులకు కలసి వస్తుంది.దీనికితోడు ఇప్పటికే తిరుపతి పరిసరాల ప్రాంతాలలోని శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు కూడా తిరుపతి అడ్డాగా వున్నారు.దీనికి తోడు వ్యభిచార ముఠాలు కూడా నగరంలో వున్నాయి. ఇవి చాల వరకు ఆన్ లైన్ ద్వారా దందా నడిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థినుల బలహీనలతోపాటు అర్థికంగా లేని వారిని ట్రాప్ చేసి ఆటో వాలాల రవాణా దారులుగా పెట్టుకోని ఈవ్యాపారాన్ని నడిపిస్తున్నారు. చాలమంది ఆటో వాలాలు హాస్టల్స్ లో వున్న అమ్మాయిలకు కుటుంబ సభ్యుల లాగా పోన్ చేసి పిలిపిస్తారు.బయటకు రాగానే నేరుగా అప్పటికే ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా బుకింగ్ అయిన కస్టమర్ దగ్గరకు తీసుకువెళుతున్నారు.ఈసమయంలో అటోలోకి ఎక్కగానే అమ్మాయి మొడలో రెడిమెడ్ తాళితో పాటు ,మొట్టెలు వేసుకొని వెళతారు.దీంతో రైడింగ్ ల గొడవ కూడా వుండదు.ఈవ్యవహారంలో ఆన్ లైన్ బుకింగ్ దారుడుతో పాటు ఆటో వాల షేర్ పోను మిగతాకి అమ్మాయిలకు ఇస్తుంటారు.అయితే ఈ వ్యవహారం ఎక్కువుగా శని,అదివారాలలో జరుగుతుంటాయి.ఇక విద్యార్థినులను ట్రాప్ చేసి సరపరా చేస్తున్న వ్యక్తులు నాయకులకు 

కూడా చలామణి అవుతున్నారు.ఇక తిరుపతి నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి సరపరా అవుతుంది.ఎక్కువుగా రైల్వే పార్సిల్ ద్వారా వైజాగ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంటుంది. పడమటి మండలాలకు చెందిన ఓ ముఠా ఇందులో కీలకంగా వ్యవహారిస్తుంది.పలుమార్లు పట్టుబడినప్పటికి వీరు ప్రతిసారి రవాణా మాత్రం అపడం లేదు.ఎక్సెజ్ శాఖ మాత్రమే అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంది.అయితే చెన్నయి,బెంగుళూరుకు ఎక్కువుగా రవాణా జరుగుతుందని అంటున్నప్పటికి  రెండు సంవత్సరాలుగా స్థానిక మార్కెట్ ను వీరు విసృతం చేసినట్లు తెలుస్తోంది.అయితే వీరు నగర శివార్లలో వున్న ఇంజనీరింగ్ కళాశాలతో పాటు యూనివర్సిటి విద్యార్థులనుటార్గెట్ చేసి అమ్మకాలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.రెండు మొడికల్ కాలేజీలతో పాటు నాలుగు యూనివర్సిటీలు,ఇక టిటిడి విద్యాసంస్థలు ,ఇంజనీరింగ్ కళశాలలతో పాటు డీగ్రీ స్థాయి విద్యార్థులను టార్గెట్ అమ్మకాలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.గంజాయి సరఫరా విషయంలో పోలీసులు కూడా ఆ దిశగా తమ దృష్టి సారించినట్లు సమాచారం.నిన్న ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజిలోని విశ్వతేజా హాస్టల్ లోకి హుక్కా పాత్ర ను తెచ్చింది కూడా కడప జిల్లా చెందిన డిగ్రీ విద్యార్థి ,తిరుపతి ప్రయివేట్ డిగ్రీ కాలేజిలో చదువుతున్నట్లు సమాచారం.ఇలాంటి వ్యవహారం చాలకాలం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తొంది.మొత్తం మీదా డ్రగ్స్ మాఫియా కన్ను తిరుపతి మీదా పడింది.ఈవిషయంలో ఇప్పటికైనా పోలీసులు ముందుగా దృష్టి సారించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.ఇప్పటికే ఎర్రస్మగ్లర్లు విద్యార్థులను విలాస జీవనానికి అలవాటు చేసి వారిని స్మగ్లింగ్ లో వాడుకుంటున్న నేపద్యం వుంది.వారు మరింతగా దిగజారకుండా అసాంఘిక శక్తులను హాస్టల్స్ లోకి రాకుండా చర్యలు తీసుకోక పోతే డ్రగ్స్ మాఫియా లీలలు మరింతంగా పెరిగే అవకాశముంది.

Related Posts