YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహానటిలో మాయమైన పాత్రలు

మహానటిలో మాయమైన పాత్రలు

అలనాటి అందాల తార జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం.. మంచి టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో కొన్ని పాత్రలను తెరపై చూపించలేదని టాక్. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్వకత్వంలో రూపొందించిన ఈ సినిమా నిడివి చాలా పెద్దది. దీంతో, అన్ని పాత్రలను తెరపై చూపించడం వీలుకాకపోగా.. చివరి నిమిషంలో సినిమాలో చిత్రించిన కొన్ని కీలక పాత్రల సన్నివేశాలను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమాలో సావిత్రి భర్త శివాజీ గణేషన్ రెండో భార్య పుష్పవల్లి పాత్రను కత్తిరించారు.  ఆ పాత్ర పోషించిన నటి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహానటి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చిందని, తన పాత్రను సినిమా నుంచి తొలగించడం కొంచెం బాధ కలిగించిందని పలు వార్తా కథనాలు వచ్చాయి. సినిమా నిడివి నేపథ్యంలోనే తన పాత్రను చూపించలేక పోయారని, అది తాను అర్థం చేసుకోగలనని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఆమె వ్యాఖ్యలపై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం తన పాత్రలేదనే బాధను తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ పెట్టానే తప్ప.. సినిమా యూనిట్‌పై తాను ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. తన వాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించి మరీ రాశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆమె ఆ పోస్టును తన ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి తొలగించారు.

Related Posts