YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేనేతకు ప్రత్యేక కార్పోరేషన్ : మంత్రి సోమిరెడ్డి

చేనేతకు ప్రత్యేక కార్పోరేషన్ : మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో చేనేత ఐక్యవేదిక దీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర,  టీడీపీ సీనియర్ నేత  పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  కిలారి వెంకటస్వామి నాయుడు,   టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జెడ్.శివప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు పాల్గోన్నారు.  మంత్రి మాట్లాడుతూ  గాంధీ గారి బాటలో నడుస్తూ శాంతియుత జీవనం గడపడానికి మారుపేరు చేనేతలు.  చేనేత కార్మికులంటే మాకు ఎంతో గౌరవం.  చేనేతల సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. ఐక్యవేదిక ప్రతినిధులు నా దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటిని రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.  వీలైనంత త్వరలోనే చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

Related Posts