రైతు బంధు పథకం క్రింద రైతులకు ఇచ్చే 12,000వేల కోట్లు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మాట అంటే సిగ్గు ఉండాలే. అలాంటి వాళ్ళను చూసి తెలంగాణ సిగ్గు పడుతుందని రాష్ట్ర అర్ధిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం నాడు జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రైతు బంధు పథకం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద విరుచకపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా రైతు ఋణమాఫీ కోసం 3 సంవత్సరాలు జమ చేస్తే ఇదీ ఎన్నికల స్టంట్ అన్న ఉత్తమ్ సమాధానము చెప్పగలవా అని నిలదీసారు. ఏనాడయిఆ 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖమేన మీది అని విమర్శించారు. రాబోయే కాలంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పచ్చ కామెర్ల వానికి లోకం అంత పచ్చగానే కనపడుతున్నట్లు ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి అని మంత్రి ఆరోపించారు. చిల్లర, మల్లర మాటలు, రాజకీయాలు మాటలు మానుకో ఉత్తమ్ అని సూచించారు. ప్రజల సనస్యలను, కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ. ప్రజలు వీరిని నమ్మరని అయన అన్నారు.