సంపాదించు అనుభవించు అనే నిదానం తో నిరుద్యోగులకు సంచార స్వయం ఉపాది పథకం (సెల్ఫ్ ఎంప్లొయ్ మెంట్) ను అఖిల భారత చిన్న తరహ పరిశ్రమల మైనారిటీ కమిటి ఏర్పాటు చేస్తుంది.నిరుద్యోగుల్లో స్వయం ఉపాది ఫై అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక వాహనాన్ని రూపొందించినట్లు అఖిల భారత చిన్న తరహ పరిశ్రమల మైనారిటీ కమిటి అద్యక్షులు ఎస్. జెడ్.సయ్యద్ తెలిపారు. ఈ వాహనం నగరం లోని వివిధ ప్రాంతాలలో సందర్శిస్తుందని,ఆ యా ప్రాంతాలలో ఉండే నిరుద్యోగులకు తక్కువ ఖర్చు తో స్వయం ఉపాది ద్వార ఎక్కువ లాబాలు ఏలా వస్తాయో వివరిస్తామని ఆయన తెలిపారు.ఈ పథకం మొదటి దశను గత సంవత్సరం కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంబించారని ,రెండోవిడతను ఈ నెల 20 వ తేదిన హైదరాబాద్ లోని నాంపల్లి లో గల మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ లో ప్రారంబిస్తామని సయ్యద్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆవ్వ్హానిస్తామని ,నిరుద్యోగులకు అవగహన కల్పించడానికి వివిధ రకాల చిన్న తరహ స్వయం ఉపాది పతకాలను ప్రదర్శనగా ఉంచుతామని ఆయన తెలియజేశారు.అవసరమైన నిరుద్యోగులు కావలసిన సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నంబర్ 9849932346 ను సంప్రదించాలని ఆయన కోరారు.