YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆఫీసులో ప్ర‌భుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్ వాడొద్దు: మ‌ద్రాస్ హైకోర్టు

ఆఫీసులో ప్ర‌భుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్ వాడొద్దు: మ‌ద్రాస్ హైకోర్టు

చెన్నైమార్చ్ 15
మ‌ద్రాస్ హైకోర్టు ఇవాళ ఓ పిటిష‌న్‌పై కీల‌క తీర్పును వెలువ‌రించింది. విధుల్లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల కోసం మొబైల్ ఫోన్ వాడ‌రాద‌ని కోర్టు త‌న తీర్పులో చెప్పింది. మ‌ద్రాస్ హైకోర్టు జ‌స్టిస్ ఎస్ఎం సుబ్ర‌మ‌ణియం ఈ తీర్పును వెలువ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశ‌గా నియ‌మావ‌ళిని రూపొందించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ఈ రూల్స్‌ను పాటించ‌ని ఉద్యోగుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా హైకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.

Related Posts