YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఛత్తీస్గఢ్  లో  ఘోర రోడ్డు ప్రమాదం

రాయ్పూర్
ఛత్తీస్గఢ్  లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై వెళుతున్న  ట్రాక్టర్ ను ఒక  ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్లో 14 మందిని సమీపంలోని అసుపత్రికి  తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ట్రాక్టర్ గరియాబంద్ నుంచి మెయిన్పురి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం
గరియాబంద్ ప్రమాద ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.  గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Related Posts