YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెన్నా బ్యారేజ్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్

పెన్నా బ్యారేజ్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్

నెల్లూరు
నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఇళ్ళు తొలగించకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణపనుల్లో  వేగం పెంచాలని ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ పెన్నా , సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. ఏప్రిల్ నెలాఖరుకి పనులు పూర్తి చేస్తాము. మే నెలలో మంచి ముహూర్తం చూసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాము. సంగం బ్యారేజ్ కి గౌతం రెడ్డి సంగం బ్యారేజ్ గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తాం. రెండు బ్యారేజ్ లు ప్రారంభమైతే సాగు తాగు నీటి సమస్యకు  శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.

Related Posts