YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్ రెడ్డి

సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్ రెడ్డి

మెదక్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  దేశంలో రైతుల సంక్షేమం నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు. నేడు అధికారంలో ఉన్న బిజెపి రైతులకు అన్యాయం చేస్తుందని కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, నిరుపేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేసాం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాం. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చట్టాలు తీసుకువచ్చాం. బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతుల హక్కులను కాలరాసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చారని అన్నారు.

Related Posts