YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ నుంచి ఒక్కరోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ నుంచి ఒక్కరోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుతో ఒక్క రోజు సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభం అయినప్పటినుంచే టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. నాటుసారా, కల్తీ మద్యం నిషేధించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిసనత తెలుపుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ చెయిర్ ను, శాసన సభను అవమానించడమే తెలుగుదేశం సభ్యులు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనబడుతోందని తమ్మినేని సీతారాం అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు నివాదాలు చేయడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన సభా సమయాన్ని వృథా కానీయొద్దని, సభా మర్యాదను కాపాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు. దీంతో టీడీపీ సభ్యులను సభాపతి సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

Related Posts