YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నల్గొండ నుంచి కేసీఆర్ సార్ పోటీ..?

నల్గొండ నుంచి కేసీఆర్ సార్ పోటీ..?

నల్గొండ , మార్చి 21,
తెలంగాణలో ‘ముందస్తు’ ముచ్చట జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నియోజక వర్గం మారబోతున్నారా.. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుబోతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాఫిక్‌గా మారింది.. తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్.. ఈ సారి తాను పోటీ చేసే స్థానం విషయంపై మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.పోటీ విషయాన్ని ఇటీవల పలువురు నేతల వద్ద సీఎం స్వయంగా ప్రస్తావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశం చుట్టూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు చెందిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్, మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో పార్టీతో పాటు ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. అయితే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం మరింత పెరిగేలా సీఎం కేసీఆర్ తన వ్యూహాలను పన్నుతున్నారు. దక్షిణ తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకుగాను కేసీఆర్‌ ఈ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.పోటీ విషయం క్రమంగా బయటకు పొక్కడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. వాస్తవానికి కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని తొలుత గులాబీ పార్టీలో చర్చించుకున్నప్పటికీ, తాజాగా కేసీఆర్‌ ఎన్నికల వ్యూహంలో భాగంగా మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఈ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై కూడా ఉంటుందని భావిస్తున్న కేసీఆర్‌.. ఈసారి ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది..కాగా, మునుగోడు నుంచి ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి స్థానికేతరుడైనప్పటికీ కోమటిరెడ్డి కుటుంబానికి ఉన్న క్రేజ్‌తో గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తారా? బీజేపీ తరఫున బరిలోకి దిగుతారా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మరోవైపు భువనగిరి ఎంపీగా తిరిగి పోటీ చేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడినా, ఎంపీగా పోటీ చేసినా మునుగోడులో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారుతుంది. బీజేపీకి కూడా అక్కడ బలం లేదు.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్‌ మునుగోడు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపుతున్నట్లు తెలుస్తోంది..

Related Posts