YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనధికారంగా ఉన్న గోదాములపై చర్యలు హోం మంత్రి మహమూద్ అలీ

అనధికారంగా ఉన్న గోదాములపై చర్యలు హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్
రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు. బుధవారం తెల్లవారుజామున  సికింద్రాబాద్  బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని హోం మంత్రి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు.  ప్రమాదంలో 11 మంది మరణించారు. మృత దేహాలను గాంధీ అసుపత్రికి తరలించారు. అక్కడ వాటి గుర్తింపు జరుగుతున్నదని తెలిపారు. ఆరు మృతదేహాల గుర్తించారు. మరో ఐదు  మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. వారి మృతదేహాలను ఎయిర్ అంబులెన్స్లో స్వస్థలాలకు పంపిస్తామన్నారు.

Related Posts