YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి పై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి పై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు

న్యూఢిల్లీ మార్చ్ 23
కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేశారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని బిశ్వేశ్వ‌ర్ తుడు అబ‌ద్ధాలాడి, పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన బిశ్వేశ్వ‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్నారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపింద‌ని టీఆర్ఎస్ ఎంపీలు స్ప‌ష్టం చేశారు.జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే తెలంగాణ‌ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది. బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా అక్నాలెడ్జ్‌ చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పింది. ఇప్పుడేమో అసలు అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్దకు రానేలేదని పార్లమెంట్‌లో దారుణంగా అబ‌ద్ధ‌లాడింది.

Related Posts