YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బోట్ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర విచారం

బోట్ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర విచారం

తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం సమీపంలో పడవ ప్రమాద ఘటనపై  వైకాపా అధినేత వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. సహాయ కార్యక్రమాలో కోసం  పార్టీ తరఫున కమిటీని ఏర్పాటుచేసారు. కమిటీలో మాజీ మంత్రి ధర్మాన, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, జక్కంపూడి విజయలక్ష్మి , తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్సీపీ యువజన నాయకులు అనంత్ ఉదయ్భాస్కర్ వున్నారు. ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకోవాలని  జగన్ కమిటీ సభ్యులను కోరారు. బాధితులకు అండగా ఉంటూ, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని పార్టీ నాయకులను జగన్ సూచించారు. తరచుగా బోటు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో జరిగిన ఘటనల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఈ ప్రమాదాలను  నియంత్రించలేకపోతోంది? తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవాలన్నారు. 

Related Posts