YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో నిజం  లేదు

-  అవన్నీ పుకార్లే.. నమ్మొద్దు

- ప్రస్తుతం 'ఎస్వీబీసీ' చానెల్‌కు డైరక్టర్‌‌గా పనిచేస్తున్న

- దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా వార్తలు హల్‌చల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించారు రాఘవేంద్రరావు. ఈ విషయంపై తనకు పలువురు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారని.. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం 'ఎస్వీబీసీ' చానెల్‌కు డైరక్టర్‌‌గా పనిచేస్తున్న రాఘవేంద్రరావు.. ఈ చానెల్ ద్వారా మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్‌ను వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరించి స్వామివారి సేవలో తరించాలన్నదే తన కోరిక అని అన్నారు.

Related Posts