YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పదిమంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

పదిమంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్
కొత్తగా నియమితులైన  పదిమంది హైకోర్టు న్యాయమూర్తులు గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేసారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్చంద్రశర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ పది మంది న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైనవారిలో.. న్యాయ వాదుల కోటా నుంచి కాసో సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, వ్వాడి శ్రీదేవి, నాచరా వెంకటర్ శవణ్ కుమార్, న్యాయాధికారులు విభాగం నుంచి జీ అనుపమ చ్రకవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబ శివ నాయుడు, ఏ సంతోష్ రెడ్డి, డాక్టర్ డీ నాగార్జున హైకోర్టు న్యాయ మూర్తులుగా ప్రమాణం చేసారు. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. హైకోర్టులో ఒకేసారి 10 మంది న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి.

Related Posts