YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

100 కోట్లతో హెలికాప్టర్ కోనుగోలు చేసిన రవి పిళ్లై

100 కోట్లతో  హెలికాప్టర్ కోనుగోలు చేసిన రవి పిళ్లై

ముంబై, మార్చి 25,
ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్-145ను భారతీయ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. దీంతో రూ.100 కోట్ల ఖరీదైన ఈ విమానం కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా నిలిచారు. అల్ట్రా నియో హెలికాప్టర్‌ను ఎయిర్‌బస్ హెచ్-145గా పిలుస్తారు. ఇలాంటి హెలికాప్టర్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 మాత్రమే ఉన్నాయి. ఈ లగ్జరీ హెలికాప్టర్‌లో పైలట్ సహా ఏడుగురు ప్రయాణించవచ్చు. సౌకర్యాలతో పాటు భద్రతకు కూడా పెద్దపీట వేశారు.అత్యుత్తమ సెక్యూరిటీ ఫీచర్లను ఈ ఎయిర్ బస్ హెచ్-145 హెలికాప్టర్ లో పొందుపరిచారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ యజమాని రవి పిళ్లై కేరళకు చెందినవారు. దుబాయ్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఎక్కువ కాలం సొంత రాష్ట్రంలోనే రవి పిళ్లై గడుపుతుంటారు. కొత్త హెలికాప్టర్‌ను భారత్‌కు తెప్పించుకున్నారు. కేరళలోని కోవలంలో ఈ హెలికాప్టర్‌ను ఎయిర్‌బస్ సంస్థ డెలివరీ చేసింది.ఈ హెలికాప్టర్‌లో కోవలం నుంచి అష్టముడి వరకు రవి పిళ్లై ఆదివారం తొలి ప్రయాణం చేశారు. ఇది భారత్‌లో మొదటి ఎయిర్‌బస్ డీ3 హెలికాప్టర్ కాగా.. ఆసియాలో మొదటి ఫైవ్ బ్లేడ్ హెచ్145 హెలికాప్టర్. ఆర్పీ గ్రూప్‌‌నకు ‘ది రవిజ్ కోవలమ్’పేరుతో కొల్లాం, అష్టముడి, తిరువనంతపురంల్లో హెలిప్యాడ్స్ ఉన్నాయి. ఈ అత్యాధునిక హెలికాప్టర్‌ను ఇక్కడే నిలపనున్నారు.సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగల సత్తా ఉన్న ఎయిర్‌బస్ హెచ్-145.. ఫోర్ టన్ క్లాస్ ట్విన్ ఇంజిన్ రోటర్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ రేంజ్. ఈ లగ్జరీ చాపర్ ను మెర్సిడెస్ బెంజ్ సంస్థ డిజైన్ చేయడం మరో విశేషం. భద్రత విషయంలో అత్యాధునిక ప్రమాణాలను పాటించారు. ఒకవేళ ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటపడటానికి ఏర్పాట్లు చేశారు. ఇంధనం లీకేజీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. H145లో అధునాతన వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ కూడా అమర్చారు.ఆర్పీ గ్రూప్ అధినేత 68 ఏళ్ల రవి పిళ్లై ఆస్తుల2.5 బిలియన్ డాల‌ర్లు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.

Related Posts