YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

మంథని,
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు  పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలకు నిరసనగా  శుక్రవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకులు  చంద్రుపట్ల సునీల్ రెడ్డి  ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి  మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు వెంటనే పెంచిన విద్యుత్ సర్ చార్జీలు తీసివేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  మంథని టౌన్ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ప్రధాన కార్యదర్శి  సబ్బని సంతోష్ మండల ప్రధాన కార్యదర్శి తోట మధుకర్ సీనియర్ నాయకులు కొండపాక సత్యప్రకాష్, భోగోజు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి  బోయిని నారాయణ  నాంపల్లి రమేష్, చిలువేరి సతీష్, అయింటి మల్లేష్, పోతర వేణి క్రాంతి,వేల్పుల సత్యం, మేదర బోయిన రవి, దాసరి శ్రావణ్ కుమార్, కాచర్ల సూర్య పాల్గొన్నారు.

Related Posts