YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మాల మహానాడు నేతల ఆగ్రహం

మాల మహానాడు నేతల ఆగ్రహం

హైదరాబాద్
రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహా నాడు ఆందోళన కు దిగారు. ఇదే డిమాండ్ తో ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దీక్ష కు అనుమతి ఇవ్వాలని  సెంట్రల్ జోన్ డిసిపి రాజేష్ చంద్రతో వాగ్విదానికి దిగారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ... అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహనాడు నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. ఈ నేపధ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

Related Posts