YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాత్రి వేళ సైకిల్పై ఐపీఎస్ అధికారిణి గస్తీ తమిళనాడు సీఎం అభినందన

రాత్రి వేళ సైకిల్పై ఐపీఎస్ అధికారిణి గస్తీ తమిళనాడు సీఎం అభినందన

చెన్నై
రమ్య భారతి  2008 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారిణి. ఇప్పుడు  గ్రేటర్ చెన్నై ఉత్తర మండల సంయుక్త పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి చెన్నైలోని ఫ్లవర్ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్పై గస్తీ నిర్వహించారు. రాత్రి రెండున్న గంటలనుంచి తెల్లవారుజామున నాలుగున్నర వరకు ఆమె సైకిల్ పై తిరిగారు. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ విషయం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి వెళ్లింది. ట్విటర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.

Related Posts