YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెప్టెంబర్ వరకు ఫ్రీ రేషన్

సెప్టెంబర్ వరకు ఫ్రీ రేషన్

న్యూఢిల్లీ మార్చి 29,
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద ఉచిత ఆహార ధాన్యాలను అందించే స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వంఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసే స్కీమ్‌ పీఎంజీకేఏవైను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన సెప్టెంబర్ 2022 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.2020లో కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా రేషన్‌ను అందించే ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను తొలుత మార్చి 2020లో ప్రకటించారు. మొదటిసారి ఈ స్కీమ్‌ను ఏప్రిల్ నుంచి జూన్ 2020 మధ్య కాలానికే ప్రవేశపెట్టారు. కానీ ఆ తర్వాత ఈ స్కీమ్‌ను నవంబర్ 30, 2021 నుంచి మార్చి 31 2022 వరకు పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం మరోసారి సెప్టెంబర్ 2022 వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత రెండేళ్లలో ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2.6 లక్షల కోట్లను ఖర్చు చేసింది. మరో ఆరు నెలల పాటు దీన్ని పొడిగించడంతో.. మరో రూ.80 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.పీఎంజీకేఏవై కింద 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రతి నెలా ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్‌ఎఫ్‌ఎస్ఏ) కింద, 80 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆహార ధాన్యాలతో పాటు ఉచిత రేషన్‌ను కూడా వీరికి అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ కేవలం రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే. ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉంటారో, ఆ భారతీయ పౌరులు మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు.

Related Posts