YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూన్ 30 నుంచి అమర్ నాధ్ యాత్ర

జూన్ 30 నుంచి అమర్ నాధ్ యాత్ర

శ్రీనగర్ మార్చి 29,
రెండేళ్లుగా కరోనా వైరస్ వ్యాప్తితో పూర్తిస్థాయిలో అమర్‌నాథ్ యాత్ర కొనసాగడం లేదు. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో అమర్‌నాథ్‌ యాత్రను చేపట్టాలని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాత్ర జూన్‌ 30 నుంచి ప్రారంభం కానుండగా.. 43 రోజుల పాటు సాగనుంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ యాత్రను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ బోర్డ్‌ ప్రతినిధులతో జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆదివారం సమావేశమయ్యారు.సందర్భంగా యాత్రను జూన్ 30న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ‘‘ఈ రోజు శ్రీఅమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం... జూన్ 30న ప్రారంభించి రక్షాబంధన్‌తో ముగిసేలా 43 రోజల పాటు కోవిడ్ నిబంధనల మధ్య అమర్‌నాథ్ యాత్రను నిర్వహించనున్నాం.. యాత్రకు సంబంధించి అనేక అంశాలను లోతుగా చర్చించాం’’ అని పేర్కొన్నారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డును 2000 సంవత్సరంలో ఏర్పాటుచేయగా.. లెఫ్టినెంట్ గవర్నర్‌ అందులో ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఉంటారు.అమర్‌నాథ్ యాత్ర కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత 2019 ఆగస్ట్‌లో అమర్‌నాథ్‌ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఏడాది నుంచి కరోనా వ్యాప్తి మొదలయ్యింది. దీంతో గత రెండేళ్లుగా కరోనా నిబంధనలకు అనుగుణంగా యాత్ర నామమాత్రంగా సాగింది. ప్రస్తుతం యాత్రను పూర్తిస్థాయిలో చేపట్టనుండటంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వురుడుని దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ఇక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. ఇక్కడికి చేరుకోలేం. అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే జూన్ మాసం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజులంతా ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది.పరమ శివుడు పంచ భూతాల్లో ఉన్నాడని ప్రజలు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమరనాథ్ గుహలో ఉన్న శివుడు జలరూపంలో ఉన్నాడని ప్రజల నమ్మకం. అంతేగాక ఈ గుహ లోపల నీటి చుక్కలతో ఏర్పడే మంచు గడ్డ శివలింగాన్ని తలపిస్తుంది. అమరనాథ్ గుహ సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది జమ్ముకు 178 కిమీల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో చేరుకోవచ్చు.బల్తాల్ నుంచి అమరనాథ్‌కు చేరుకోవాలంటే ఒకటి నుంచి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాలి. పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిమీలు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్‌కు సుమారు 3 నుంచి 5 రోజులు సమయం పడుతుంది.

Related Posts