YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చమన్ బీసీల పక్షపాతి : పల్లే

చమన్ బీసీల పక్షపాతి :  పల్లే

 అనంతపురం జడ్పి హాల్ లో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసి జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  జడ్పిచైర్మన్ పూల నాగరాజు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు, జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ ,ఆనంద్ బాబు,  బోరంపల్లి ఆంజనేయులు, అదిశేషు,తదితరులు  హజరయ్యారు. ముందుగా మాజీ జడ్పిచైర్మన్ చమన్ చిత్రపటానికి చీఫ్ విప్ పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత అయన మాట్లాడుతూ చమన్ సాబ్ లేని లోటు  ఎవరు పూడ్చలేనిది. ఆయన ఆకస్మిక మరణం నాకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది.కలచివేసిందని అన్నారు. రాజకీయాల్లో చమన్ చెరగని ముద్ర వేసుకున్నాడు. బాల్యం నుంచే పేదల కోసం ప్రజా పోరాటాలు చేశారని అన్నారు.  జడ్పిచైర్మన్ గా ప్రజల కోసం ఎనలేని సేవ చేశారు. చమన్ ప్రజా పోరాట యోధుడు...ఆయన ప్రజల్లో అమరజీవిగా నిలిచిపోయారని అన్నారు. పేదల మనిషిగా ,ప్రజా బంధువుగా, సేవ నాయకుడిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకొన్నారు.ఆయన ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చమన్ బీసీల పక్షపాతి.. బీసీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని కొనియాడారు. 

Related Posts