YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కెసిఆర్ నీకు దమ్ముందా నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా...

కెసిఆర్ నీకు దమ్ముందా నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా...

కెసిఆర్ నీకు దమ్ముందా నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా...
* చిన్నపిల్లల అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేయకండి
* నా కుటుంబ సభ్యులను తప్పించాలని కోరానా
* పట్టుకున్న వారి సాంపిల్స్ ఎందుకు సేకరించలేదని
* కుంటుంబీకులు ఎవరున్నా సరే .. రక్త నమూనా పరీక్షలు చెపిస్తా..
* రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్ గా మార్చేసేందుకు  కేసీఆర్ కుట్ర
* కేసు అడ్డుపెట్టుకుని సినీరంగం నుంచి అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారు
* 24 గంటల మద్యం అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే
* డ్రగ్స్ వ్యవహారం పై స్పందించిన రేవంత్ రెడ్డి
డ్రగ్స్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చేసే కుట్ర కేసీఆర్ కుటుంబం పూనుకుందని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. నేడు డెల్లి లో మీడియా సమావేశం లో చిన్నారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్ తో కలిసి మాట్లడుతూ చిన్నపిల్లల అడ్డం పెట్టుకుని నాపై రాజకీయం చేయడం ఏంటి... శిఖండి రాజకీయాలు చేయకండి అంటూ తీవ్రస్ద్థాయిలో విరుచుక పడ్డారు. నా కుటుంబ సభ్యులను తప్పించాలని కోరానా, డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి పట్టుకున్న వారి సాంపిల్స్ ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. నా కుంటుంబీకులు ఎవరున్నా సరే ..నా పిల్లల రక్త నమూనాలు వెంట్రుకలు అందరికి పరీక్షలు చెపిస్తా.. కెసిఆర్ నీకు దమ్ముందా నీ కొడుకు నమూనాలు ఇప్పిస్తావా...అని సవాలు విసిరారు. సమాజంలో ప్రజలను కాపాడాల్సిన నైతిక బాధ్యత నాపై ఉందన్నారు. నేను నా బందువుల నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా,142 మందిని అదుపులోకి తీసుకుని సంపిల్స్ తీసుకోలేదంటే మీరు ఎవరినో తప్పించడానికి చూస్తున్నారన్నారు .పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, నా మేనల్లడిని డ్రగ్స్ తీసుకున్నాడా లేదో తెలుసుకునేందుకు సాంపిల్స్ కోసం పంపిస్తా...కేసీఆర్ కేటీఆర్ ను పంపిస్తావా.. అన్ని విచారణలకు సిద్ధంగా ఉన్నా.. చదువుకునే పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. డ్రగ్స్ వ్యవహారం పై నిష్పక్షపాత విచారణ కోరుతున్నానని, సీబీఐ ఈడి తో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. గతంలో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పై కోర్టును సైతం ఆశ్రయించా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసా.. డ్రగ్స్ వ్యవహారం పై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని పోరాడింది నేనే నన్నారు. ఈడీకి పూర్తి సమాచారం బదిలీ చేయాలనీ ఆదేశాలు వచ్చినా అది జరగలేదన్నారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగం పై కేటీఆర్ పట్టు సాధించారని, డ్రగ్స్ కేసు అడ్డుపెట్టుకుని సినీరంగం నుంచి అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారన్నారు. 24 గంటల మద్యం అనుమతి ఇచ్చింది ప్రభుత్వమేనని, రాష్ట్రంలో జరుగుతున్న మాదకద్రవ్య వ్యాపారాలపై 2017లోనే హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా పై స్వచ్ఛంద సంస్థలతో ఎంక్వైరీ చూపించాలని కోరానన్నారు. 2017 లో సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాతనే కేటీఆర్తో సినిమా వాళ్ళు దగ్గరయ్యారని, 2017 కు ముందు కేటీఆర్ కి సినిమా వాళ్ళు ఎవరు పరిచయం లేదని ప్రశ్నించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని కేటీఆర్ సినిమా వాళ్లతో సన్నిహితంగా ఉంటున్నాడన్నారు. రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.. పబ్ లో దొరికిన వారిపై ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించి లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై త్వరలో కోర్టు కి వెళ్తాను... గతంలోనే డ్రగ్స్ కేసులో దొరికిన వారి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ వీడియో క్లిప్స్ సీజ్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. నా బంధువుల పేర్లు ఎవరైతే పేర్లు బయటికి వచ్చాయో వారి నమూనాలను ఇప్పిస్తాని, అసలు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలి పెట్టి , మా పిల్లల పై ఆరోపణలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. చిన్నపిల్లల అడ్డం పెట్టుకుని నాపై రాజకీయం చేయడం ఏంటి... శిఖండి రాజకీయాలు చేయకండని హితవు పలికారు.

Related Posts