YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ భ‌ద్ర‌త‌కు ఆటంకం క‌లిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్ల‌పై నిషేధం

దేశ భ‌ద్ర‌త‌కు ఆటంకం క‌లిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్ల‌పై నిషేధం

న్యూఢిల్లీ ఏప్రిల్ 5
దేశ భ‌ద్ర‌త‌కు, విదేశీ సంబంధాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్ల‌ను కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు ఇండియాకు చెందిన‌వి కాగా, మ‌రో 4 పాకిస్తాన్ యూట్యూబ్ చానెళ్లు అని ఆ శాఖ స్ప‌ష్టం చేసింది. ఐటీ రూల్స్, 2021 ప్ర‌కారం తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్ల‌ను బ్లాక్ చేసిన‌ట్లు తెలిపింది.యూట్యూబ్ వీక్ష‌కుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు కొన్ని టీవీ చానెళ్ల లోగోల‌ను కూడా ఈ యూట్యూబ్ చానెళ్లు ఉప‌యోగించుకున్నాయ‌ని పేర్కొన్న‌ది. త‌ప్పుడు థంబ్ నెయిల్స్‌తో ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళ‌ప‌రిచిన‌ట్లు తెలిపింది. వీటితో పాటు 3 ట్విట్ట‌ర్ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.

Related Posts