YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ జనపోరు ప్రారంభం

బీజేపీ జనపోరు ప్రారంభం

శ్రీకాకుళం
శ్రీకాకుళం  జిల్లాలో జలం కోసం గురువారం బీజేపీ ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర ప్రారంభించింది. ఇందుకోసం శ్రీకాకుళం చేరుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ యాత్రకు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నేతలు హాజరు అయ్యారు . సోము వీర్రాజు మాట్లాడుతూ సాగు, తాగు నీరు లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్ళలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని.. ఆ దమ్ము ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉత్తరాంధ్ర, సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.

Related Posts