YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రధాన అర్చకులను తొలగించిన టీటీడీ

 ప్రధాన అర్చకులను తొలగించిన టీటీడీ

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించారు. 65 సంవత్సరాలు దాటిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని పాలకమండలి వెంటనే అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో ప్రధాన అర్చక హోదాను రమణ దీక్షితులు కోల్పోనున్నారు. రమణ దీక్షితులుతో పాటు నరశింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవులు కోల్పోయారు. అంతకుముందు పాలకమండలి భేటీలో రమణదీక్షితుల  ఆరోపణల అన్నిటి పై చర్చ జరిగింది. రమణదీక్షితులకు ఈవో నోటీసు జారీ చేసారు. వివరణ ఇచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.  ప్రతి సంవత్సరం ఆభరణాలను గ్రాములతో సహ లెక్కిస్తామని వివరణ ఇచ్చారు. 

Related Posts