YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో ఆర్ధరాత్రి దోపిడి

సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో ఆర్ధరాత్రి దోపిడి

అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద   శుక్రవారం రాత్రి  దోపిడి జరిగింది. రైల్వే సిగ్నల్ కట్ చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్లో  దోపిడి చేసిన దుండగులు. ప్రయాణికుల  బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. బాధితులు కర్నూల్ జిల్లా డోన్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.  అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో సిగ్నల్ లేకపోవడంతో స్టేషన్ ఔటర్ లో ఆగిపోయింది. వెంటనే దుండగులు బోగి లోకి చొరబడి మారణాయుధాలను చూపించి ప్రయాణికులను దోచుకున్నారు. వారి నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఆరు తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులతోపాటు సివిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపారు.

Related Posts