YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు

అనకాపల్లి
 భారతప్రధాని నరేంద్రమోదీ  ప్రకటించిన జలజీవన్ మిషన్ ద్వారా కశింకోట లో ఏర్పాటు చేసిన కుళాయి కనెక్షన్ ద్వారా తాగునీటి ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు అందించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం లో 24 గ్రామాల్లో జలజీవన్ ద్వారా నిధులు మంజూరు చేశారు. ఈకార్యక్రమంలో  ఎమ్మెల్సీ మాధవ్ , జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి  భూపతి రాజు శ్రీనివాస వర్మ , జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారారణ తదితరులు పాల్గొన్నారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ  వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ కు చురకలు అంటించారు. పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ని సమర్థిస్తూ మాట్లాడటం కాదు, ఇక్కడ మీ రైతులతో మాట్లాడి వారి సమస్యలుతీర్చండని అన్నారు.

Related Posts