విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన ప్రాధ్యాన్యత సంతరించుకుంది. బుధవారం తిరుపతిలో పర్యటించిన పవన్ అక్కడి పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు.అయితే అక్కడే పవన్ బస్సు యాత్ర పై ప్రకటన చేస్తారని ముందుగా అనుకున్న సమయంలో విశాఖ వచ్చిన ఆయన బస్సు పర్యటనపై ప్రకటన చేశారు.
జనసేన ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 25 నుంచి 40 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ ను పవన్ ప్రకటించారు. రాష్ట్ర విభజనతో నష్ట పోయిన రాష్టానికి నికి న్యాయం చేయాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు యాత్రను చేపడుతున్నట్టు పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు యాత్రకొనసాతున్నట్లు పవన్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లోబస్సుయాత్ర, ప్రతి జిల్లాలోయాత్ర తర్వాత లక్ష మందితో నిరసన కవాతులు వుంటాయి. విశాఖలోనే రెండు రోజులు కార్యకర్తలు, నియోజక వర్గ నేతలతో సమావేశం వుంటుంది. ఇది ప్రజాయాత్ర. రోడ్ షోలు, పాదయాత్రలు, అన్నీ ఉంటాయి. ఇది కేవలం బస్సు యాత్ర కాదని అయన అన్నారు. రాజకీయ జవాబుదారీతనంమీద ప్రజల్లో అవగాహన పెంచటమే మా పార్టీ లక్ష్యమని అయన అన్నారు. కర్నాటక రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ అక్కడ బీజేపీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందే నాకు చెప్పారు. అన్ని పార్టీలూ హార్సు ట్రేడింగ్ చేస్తుంటే బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేకుండా పోయిందని పవన్ అన్నారు.