YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

19 మంది మృతి..ఒకరు గల్లంతు

19 మంది మృతి..ఒకరు గల్లంతు

తూర్పు గోదావరి జిల్లా  మంటూరు లాంచీ ప్రమాదంలో 19మంది చనిపోయారు. ఒక్కరు గల్లంతయారు. అతని కోసం గాలిస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా వెల్లడించారు. గురువారం నాడు అయన మీడియాకు ఘటనపై వివరాలు అందించారు. 17మంది ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. అలాగే గల్లంతయ్యాడ ని భావిస్తున్న మరో వ్యక్తి తన గూడెంకు చేరుకున్నాడు. త్వరలో జియో సంస్ధతో ఒప్పందం చెసుకుని ఏజెన్సీలో నలబై ఎడు చోట్ల టవర్లు ఏర్పాటు చేస్తున్నామని అయన అన్నారు. మంటూరు నుండి కొండమొదలు వరకు బండి బాట నిర్మించేందుకు సిఎం ఆదేశాల మేరకు ప్రయత్నాలు ప్రారభిస్తామని అన్నారు. ఒకపై గోదావరిలో ప్రయాణికుల తరలింపు,సామాగ్రి తరలింపుకు వెరు వెరు సర్వీసు లాంచీలు నడుస్తాయని అయన అన్నారు. ప్రస్తుతం పోలవరం ఎగువ కు వెళ్ళే అన్ని రకాల సర్వీసు లాంచీలను నిలివేశామని కలెక్టర్ అన్నారు.

Related Posts