YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యడ్యూరప్పకు అంత సీన్ లేదు

యడ్యూరప్పకు అంత సీన్ లేదు

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎట్టకేలకు అధికార పగ్గాలు చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప  ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. యడ్యూరప్ప అసెంబ్లీలో 15 రోజుల్లో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బీజేపీ అధికారం చేపట్టడంపై జేడీఎస్ సీఎం అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. మెజారిటీ ఎమ్మేల్యేలంతా తమవైపే ఉండగా... మెజారిటీ లేకున్నా యడ్యూరప్ప సీఎంగా ఎలా ప్రమాణం చేశారని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానిది మూణ్ణాళ్ల ముచ్చటేనని అన్నారు. తమ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్ (ఈడీ) దాడులుంటాయంటూ.. బీజేపీ నేతలు బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని కుమారస్వామి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో మండిపడింది. విధాన సౌధలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కర్ఱాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధ వెలుపల కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. 

Related Posts