YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పీకే.. త్వరలో సొంత పార్టీ .. బీహార్ నుంచి కొత్త ప్ర‌యాణం ప్రారంభం

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పీకే..  త్వరలో సొంత పార్టీ ..  బీహార్ నుంచి కొత్త ప్ర‌యాణం ప్రారంభం

పాట్నా మే 2
తాను కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సోమ‌వారం ట్వీట్ చేశారు. స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోడానికి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు తెలిపారు. సొంత పార్టీ కూడా పెడుతున్న‌ట్లు చెప్పారు.త‌న కొత్త ప్ర‌యాణాన్ని బీహార్ నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు పీకే ప్ర‌క‌టించారు. 10 సంవత్స‌రాలుగా ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌జ‌ల కోసం విధానాల‌ను రూపొందించాన‌ని, అర్థ‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యం కోసం ప‌నిచేశాన‌ని పేర్కొన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత అర్థం చేసుకోవాల‌ని, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాల‌ని ఆకాంక్షించారు. సుప‌రిపాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్నాన‌ని కూడా తెలిపారు.అయితే ప్ర‌శాంత్ కిశోర్ స్థాపించ‌బోయే పార్టీ పేరు జ‌న్ సురాజ్ అన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ పేరుతోనే ఆయ‌న పార్టీ స్థాపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌స్తుతం పాట్నాలోనే వున్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోనున్నారు.

Related Posts