YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐదేళ్లూ నేనే సీఎం..ముందు తానేంటో చూపిస్తా తొలి మీడియా సమావేశంలో యడ్యూరప్ప

 ఐదేళ్లూ నేనే సీఎం..ముందు తానేంటో చూపిస్తా          తొలి మీడియా సమావేశంలో యడ్యూరప్ప

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఆయన మీడియాతో ఒకే ఒక్క మాట చెప్పి వెళ్లిపోయారు. ముందు తానేంటో చూపిస్తానని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానన్న నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. బల నిరూపణ తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారుతన ప్రభుత్వం వచ్చే ఐదేళ్లూ అధికారంలోనే ఉంటుందని, మొత్తం పదవీ కాలాన్ని తాను ముఖ్యమంత్రిగా పూర్తి చేసి తీరుతానని బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ - జేడీఎస్ లు పొత్తును పెట్టుకోవడం అనైతికమని, వారు అధికారకాంక్షతోనే ఈ పని చేశారని ఆరోపించారు.తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఏ విధమైన ప్రలోభాలకూ గురి చేయాలని భావించడం లేదని వ్యాఖ్యానించిన యడ్డీ, ఎమ్మెల్యేలు తమంతట తామే మద్దతిస్తామని వస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంటానని, అందులో ఎటువంటి సందేహమూ లేదని యడ్యూరప్ప తెలిపారు..కాగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో, అభివృద్ధి కోసం అంటూ ఆ పార్టీ పంచన చేరడానికి జేడీఎస్, కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారి అండతో బీజేపీ సర్కారు బలపరీక్షలో గట్టెక్కుతుందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీకి మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండిపెండెంట్ గా గెలిచిన ఓ ఎమ్మెల్యే మద్దతు పలుకగా, మరో ఏడుగురి కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది.

Related Posts