YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వీనస్ పై ఇస్రో ప్రయోగాలు

వీనస్ పై ఇస్రో ప్రయోగాలు

బెంగళూర్, మే 5,
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడు గ్రహంపై శాటిలైట్స్ ను పంపించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. ఈ అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో బుధవారం సుదీర్ఘ చర్చలు చేపట్టింది. అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్‌ చేపట్టడం భారత్‌కు సాధ్యమేనని.. ఆ సామర్థ్యం మనకు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే రిపోర్టు సిద్ధమైందని, నిధులు కూడా సమకూరాయని వివరించారు. భూమిపై ఉన్నట్టుగానే శుక్రుడుపై జంతుజాలానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. రాను రాను వాతావరణంలో నెలకొన్న పరిస్థితులలో వీనస్.. అత్యంత ఉష్ణోగ్రత కలిగిన గ్రహంగా మారిందని అంటుంటారు. వీసస్ పై వాతావరణం ప్రమాదకరంగా ఉంటుందని, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలు ఉంటాయని చెబుతారుదీంతో వీనస్‌పై నెలకొన్న రహస్యాలను ఛేదించేందుకు అమెరికా సహా పలు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇస్రో కూడా ఈ దిశగానే మిషన్‌ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శుక్రుడి ఉపరితలంపై ఎలాంటి వాతావరణం ఉంది. ఇందుకోసం వీనస్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. నాసా కూడా శుక్రుడి చెంతకు రెండు వ్యోమనౌకలకు పంపనుంది. ఇందుకోసం బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు నిధులను సమకూర్చుకుంది.

Related Posts